సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ) ః హైదరాబాద్లోని సింధు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. యువతలో రక్తదానం పట్ల అవగాహన కల్పించేలా, ప్రాణాపాయ స్థితిలో రక్తం ప్రాముఖ్యతను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
కార్యక్రమంలో సింధు హాస్పిటల్స్, హెటిరో గ్రూప్ సంస్థల ఉద్యోగులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. సింధు హాస్పిటల్ చైర్మన్, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డా.బీ పార్థసారథి రెడ్డి, ఎండీ ఎం శ్రీనివాస్ రెడ్డి రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిజాం ఎంఎన్జేఈ క్యాన్సర్తోపాటు, ఇతర హాస్పిటళ్లకు అందజేసినట్లుగా తెలిపారు.