Siasat | హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాదం నెలకొంది. సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జహీరుద్దీన్ అల్వాల్ వెళ్లారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. జహీరుద్దీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు నిర్వహించిన గద్దర్ అంతిమయాత్రలో జహీరుద్దీన్ పాల్గొన్నారు.