బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ పాన్ బజార్కు చెందిన జె నాగేందర్ కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు.
చికిత్స నిమిత్తం అవసరమైన నగదు కోసం మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ సహాకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 2 లక్షల ఎల్వోసి పత్రాన్ని బుధవారం మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసగౌడ్ , కోషికే కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.