Maha Shivaratri | ముషీరాబాద్ జోన్ బృందం: మహా శివరాత్రి వేడుకలు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పరమశివునికి అభిషేకాలు, అర్చనలు, శివపార్వతుల కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధ్దలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాల వద్ద బారులుతీరా రు.నియోజకవర్గంలోని ముషీరాబాద్ శివాలయం, బా పూ జీనగర్ ఆభయాంజనేయ స్వామి, గంగపుత్రకాలనీ ప్రసన్న ఆంజనేయ స్వామి, రాంనగర్ రామాలయం, అడిక్మెట్ ఆంజనేయ స్వామి, భోలక్పూర్ భవాని శంకర ఆలయం,మల్లికార్జున స్వామి దేవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయా ల్లో ఉదయం అభిషేకాలు, అర్చనలు జరుగగా మధ్యా హ్నం స్వామి వారి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. రాంనగర్ రామాలయంలో జరిగిన శివపార్వతుల కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డి.రవియాదవ్, సభ్యులు ఎ.శ్రీనివాస్, గోవర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడిక్మెట్ లలితానగర్ శివాలయంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు, బి.మనోహర్సింగ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ భవానీ శంకర్ ఆలయంలో..
భోలక్పూర్ డివిజన్లోని దేవునితోటలోని శ్రీ భవానీ శంకర్ ఆలయంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆర్. శ్రీనివాస్, ఈఓ బి. జ్యోతిల సమక్షంలో ప్రధాన పూజారులు వై. విజయ్కుమార్ శర్మ, అరవింద్ కుమార్ సమక్షంలో శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పట్టు వస్ర్తాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావులు హాజరై శివ లింగానికి పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, జమాలోద్దీన్, శంకర్, సాయి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
దోమలగూడ శ్రీ హనుమాన్ ఆలయంలో..
దోమలగూడలోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, ఆలయ ఈఓ దేవనాథం నేతృత్వంలో పూజారి మహేందర్ సమక్షంలో ఎమ్మెల్యే గోపాల్, ముఠా జయసింహలు హాజరై పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
శ్రీ బాల త్రిపురసుందరి దేవీ ఆలయంలో..
దోమలగూడలోని అడ్వకేట్ కాలనీలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ టి. రవీందర్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుక లు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ గౌరీశంకర్ దేవాలయంలో…
భోలక్పూర్ డివిజన్లోని శ్రీ గౌరీశంకర్ ఆలయంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్ చారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి భరతుడు సమక్షంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జయసింహలు శివ పూజలు చేశారు.కార్యక్రమంలో భోలక్పూర్, ముషీరాబాద్ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, నర్సింగ్ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
చిక్కడపల్లిలో..
చిక్కడపల్లిలో వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు స్వామివా రిని దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ మురళీప్రసాద్, కార్యనిర్వాహణాధికారి దేవనాథం, ఎమ్మెల్యే గోపాల్, దేవాదాయ,ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, ట్రిబ్యునల్ సభ్యుడు ఈ శ్రీనివాస్ రావు,యువజన విభాగం నాయకులు ముఠా జయసింహ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో.దేవాలయం పునఃనిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో. ..
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం, స్వర్ణ పుష్పార్చన తదిరత పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్, కార్యనిర్వహణాధికారి పి.లక్ష్మారెడ్డి,ఎమ్మెల్యే ముఠాగోపాల్, దేవాదాయ,ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ సభ్యు డు ఈ శ్రీనివాస్ రావు,అస్టింట్ కమిషనర్ కృష్ణ, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్ బీఎన్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు దర్శించుకున్నారు.బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్, ముఠానరేశ్, రవిశంకర్గుప్తా, శంకర్ ముదిరాజ్, ఆనంద్,చాణిక్యరెడ్డి, గణేశ్, ఆలయ రెనివేషన్ కమిటీ సభ్యుడు రమణమూర్తి, వెంక ట గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.