శంషాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి శంషాబాద్లోని ఎగ్జిట్ నం.15 అండర్పాస్ మీదుగా వరద నీరు ప్రవహించింది. అటు వైపు ఎవరూ వెళ్లకుండా స్థానిక పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఓ లారీ డ్రైవర్ బారికేడ్లను తొలగించి, ముందుకు వెళ్లేందుకు యత్నించాడు. లారీ సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. లారీ డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు కూలీలు రక్షించాలని సహాయం కోరారు.
గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్రెడ్డి వెంటనే ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారమిచ్చాడు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ మొబైల్-1 సిబ్బంది ధన్రాజ్గౌడ్, శివశంకర్, గణేశ్ వచ్చి తాళ్ల సహాయంతో వరద నీటిలో చిక్కుకుపోయిన లారీడ్రైవర్ సహా ఇద్దరు కూలీలను కాపాడారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)