సిటీబ్యూరో, ఆగస్టు 26 : శంషాబాద్ జోన్ను పునర్విభజన చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్ను రెండుగా విభజించి, రాజేంద్రనగర్ జోన్ను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త జోన్లో చేవెళ్ల, రాజేంద్రనగర్ డివిజన్లు ఉంటాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.