శంషాబాద్ రూరల్, జూన్ 8 : గోవా నుంచి వస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్లో ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఏటీసీ అధికారులు విజయవాడ ఎయిర్పోర్టుకు మళ్లించారు. విజయవాడ ఎయిర్పోర్టుకు చేనుకున్న విమానం అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో శంషాబాద్కు తరలించినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్పోర్టు వర్గాలు వివరించాయి.