శంషాబాద్ రూరల్, జూలై 6: ఎవరికీ అనుమానం రాకుండా.. బంగారాన్ని రసాయనాల్లో కలిపి.. రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నైట్రోజన్ యాసిడ్ ద్రావణంలో బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి.. దుస్తులకు అంటుకునే విధంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. 478 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ మహిళ వద్ద 123.7 గ్రాముల బంగారాన్ని పట్టుకొని..అరెస్టు చేశారు.