సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్ఠం 29.8, కనిష్ఠం 17.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.