తొండుపల్లికి చెందిన పలువురు యువకులు ్ల జయసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– శంషాబాద్ రూరల్
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 : తెలంగాణలో బీఆర్ఎస్కే భవిష్యత్తు ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. శనివారం శంషాబాద్లోని తొండుపల్లికి చెందిన యువకులు పార్టీ నాయకులు రాచమల్ల జయసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లు కూల్చడం చేస్తుందన్నారు. ఒక్క హామీని అమలు చేయలేని కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి తాకట్టుపెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్రెడ్డి, మాజీ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్,కుమ్మరి అర్జున్, గిరి, పర్దాములు, రాచమల్ల రమే శ్,మురళి గౌడ్, అలీ,ఫాతిమా, కొండ దర్శన్గౌడ్, రమేశ్రాథోడ్,వినయ్ ఉన్నారు.