వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద్ అలీం (58) ఆకుకూరల వ్యాపారం చేస్తుంటాడు.
ప్రతీ రోజు తెల్లవారు జామునే గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లి ఆకుకూరలు కొనుకోలు చేసుకుని వస్తుంటాడు.ప్రతీ రోజు మాదిరిగానే బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనం (టీవీఎస్ ఎక్స్ఎల్) పై బోరబండ నుంచి మోతీనగర్ వైపు వెళ్తుండగా బావర్చీ హోటల్ వద్ద వెనుక నుంచి వచ్చిన మారుతీ స్విఫ్ట్ కారు ఢీకొట్టింది.
దీంతో అలీం కింద పడిపోవడంతో తలకు, కాళ్లూ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అలీంను 108 అంబులెన్స్ ద్వారా పోలీసులు చికిత్స కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, అతని దగ్గరి బంధువు సయ్యద్ యాసిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కారు నడిపిన అంజన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.