మియాపూర్, జనవరి 5 : త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో గులాబీదే విజయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల కోసమే తమ పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్రెడ్డి, నిరంజన్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎంపీ రంజిత్రెడ్డి, పార్టీ నేత కేశవరావు, సహచర ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, యాదయ్య, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్యాదవ్, జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధూ ఆదర్శ్రెడ్డి, మంజులరెడ్డి, మాధవరం రోజాదేవిరంగారావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా సహా ఇతర పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి శ్రేణులే పట్టు కొమ్మలని సైనికుల్లా పని చేసి ఎంపీ రంజిత్రెడ్డిని మరోమారు గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.