బేగంపేట్, అక్టోబర్ 31: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉందని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావునగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ ఏనుగు పుశ్వంత్రెడ్డి మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి తలసాని ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పుశ్వంత్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నంత కాలం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వస్తున్నారని విమర్శించారు. మోసకారి కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవన్కుమార్గౌడ్, బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, జనరల్ సెక్రటరీ మహేందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట్ డివిజలోని పాటిగడ్డ, ఎన్బీటీ నగర్, వడ్డెరబస్తీ, గౌతమ్నగర్, ఓల్డ్ పాటిగడ్డ,నూర్బాగ్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎన్బీటీనగర్లో అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచారరథాన్ని ప్రారంభించి పావురాలను ఎగురవేశారు. కుంకుమ తిలకం దిద్ధి మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగుల పుశ్వంత్రెడ్డి మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.