GHMC | సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో ఫలక్నుమా సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఫలక్నుమా సర్కిల్ కార్యాలయం నుంచి నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ లేకుండా దాదాపు 80 సర్టిఫికెట్లు జారీ చేశారు.
దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. అక్రమాల నిగ్గు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ను ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం చార్మినార్ జోన్లో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై వేటు వేశారు.