మర్రిగూడ, అక్టోబర్ 11: రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్రెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు. మునుగోడులో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇక్కడి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మర్రిగూడ మండలంలోని ఎర్రగండ్లపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటు వేస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. మాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్, సర్పంచ్ మాడెం శాంతమ్మ వెంకటయ్య, ఎంపీటీసీ దంటు జ్యోతి గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దం శ్రీను, నాయకులు సంతోష్యాదవ్, వెంకటయ్య యాదయ్య, మురళి, వెంకన్న యాదయ్య నరసింహచారి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.