హైదరాబద్ : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో( Secunderabad Railway station) తనిఖీలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ వద్ద నుంచి రూ. 37 లక్షల నగదను(Huge amount) రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించనందునే నగదను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.