శంషాబాద్ రూరల్ : ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా అతడి వద్ద 409 గ్రాముల బంగారం లభించినట్లు తెలిపారు.
తీగల మాదిరిగా తయారుచేసి తీసుకువచ్చినట్లు తెలిపారు. బంగారం విలువ 2.66 లక్షలు ఉంటుందన్నారు. బంగారంతో పాటు ప్రయాణికుడిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.