శంషాబాద్ రూరల్ : ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం ఇచ్చిన అధికారులు అతడిని తనిఖీలు చేయగా మలద్వారంలో దాచుకొని తీసుకువస్తున్న 975 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ బంగారం విలువ 50లక్షల రూపాయలు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.