హైదరాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తొండుపల్లి సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కర్ణాటక(Karnataka) నుంచి శంషాబాద్ వైపుకు వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న మూడు లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కరే ఉన్నారా మరో ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచరం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.