సికింద్రాబాద్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ షాపులోని ఒక బ్యాటరీ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జిపైకి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అక్కడ దట్టంగా పొగలు అలుముకొని ఊపిరాడక ఏడుగురు మరణించారు. గాయపడిన వారిని యశోద, గాంధీ ఆస్పత్రికి అధికారులు తరలించారు.
తాజాగా ఈ ప్రమాదంలో మరొకరు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లాడ్జిలో 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరు కిటికీల వద్ద ఉన్న పైపుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. లాడ్జిలో ఉన్న 9 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. రూబీ లాడ్జి ఘటనపై దర్యాప్తులో భాగంగా లాడ్జిని అధికారులుసీజ్ చేశారు. సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా షోరూం నిర్వహిస్తున్నందుకు రంజిత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.