Trains Cancelled | సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మౌలాలి-అమ్ముగూడ-సనత్నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంటుందన్నారు.
ఈ క్రమంలో సాధారణ రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, వికారాబాద్-గుంటూరు, రేపల్లె- సికింద్రాబాద్తో పాటు లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఉందానగర్, లింగంపల్లి-ఫలక్నుమా వంటి పలు స్టేషన్ల మధ్య కూడా టైమ్ టేబుల్ ప్రకారం ఎంఎంటీఎస్లను రద్దు చేశామన్నారు.