Hyderabad | సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు చెందిన 17 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు.
లింగంపల్లి-హైదరాబాద్, లింగంపల్లి-ఫలక్నుమా, ఉందానగర్-ఫలక్నుమా, రామచంద్రాపురం-ఫలక్నుమా స్టేషన్ల మధ్య నడిచే లోకల్ రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.