మియాపూర్(హైదరాబాద్) : మానవాళి మనుగడకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతికత ( Science and Techonogy ) పరిశోధనలు జరగాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Gandhi) అన్నారు. విద్యార్థులు చిన్న నాటి నుంచే ఈ తరహా అభ్యాసాన్ని నేర్చుకోవాలని అందుకు ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైన్స్ డే(Science Day) సందర్భంగా బుధవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ఫేర్ (Sciencefare) ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు సాంకేతిక, విజ్ఞాన ప్రదర్శనల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఆలోచనా నైపుణ్యం పెరుగుతుందని, తామేంటో నిరూపించుకునే ఉత్తేజం వారిలో కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలోనూ అంతర్లీనంగా దాగి ఉండే నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ప్రదర్శనలు దోహదపడ తాయన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు ఆల్విన్ కాలనీ ఆంజనేయ దేవాలయం వద్ద రాజస్థాన్ మిత్రమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమన్నారు.