సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ) : మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికులు తమ భద్ర తకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. జలమండలి మురుగునీటి నిర్వ హణ , కార్మికుల భద్రతపై నిర్వ హిస్తున్న భద్రతా పక్షోత్స వాలలో భాగంగా బుధవారం అంబర్ పేట్ ఎస్టీపీ ప్రాంగణంలో జ రిగిన అవగాన కార్యక్రమానికి ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోను ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయకూడదనే ఈ అవగాహన కార్య క్రమాలను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమని వివరించారు. పారిశుధ్య పనులలో కార్మికులు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అనంతరం పారిశుధ్య పనులు చేసే ముందు ప్రతి కార్మికుడు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని, రక్షణ పరిక రాలను తప్పనిసరిగా ఉపయోగిస్తామని..పారిశుధ్య కార్మికుల కోసం రూపొందించిన ప్రతిజ్ఞను వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఎస్టీపీ ప్రాంగణంలో ఎండీ దానకిశోర్ మొక్కను నాటి నీరు పోశారు.
కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీధ ర్బాబు, టెక్నికల్ డైరెక్ట ర్ పి. రవి కుమార్ లతో పాటు పలువురు సీజీఎమ్ లు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.