కొండాపూర్, జనవరి 21 : ప్రముఖ సంగీత అకాడమీ లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ.. బాల గాంధర్వం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై..మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, చిన జీయర్ స్వామి, శోభారాజు, వరప్రసాదరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిచయం అక్కరలేని గొప్ప సంగీత గురువు, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కొమాండూరి రామాచారి, ఆయనది నిత్య స్వర ప్రపంచమని తెలిపారు. చదువు భారంతో విసిగిపోతున్న బాల్యానికి రామాచారి సంగీతం అనే ఉల్లాసాన్ని, వికాసాన్ని అందించడం అభినందనీయమన్నారు. సంస్కార భరితమైన సంగీతాన్ని నేటి తరం బాలలు ఆదరించడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సింగర్లు పాల్గొని సందడి చేశారు.