హైదరాబాద్ : సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్ మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చీటింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారుల నుంచి శ్రీధర్ భారీగా నగదు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మాదాపూర్ ఏసీపీ రఘునందన్ త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నారు.