సికింద్రాబాద్, జనవరి 28: కంటోన్మెంట్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించడంతో పాటు ఉచిత తాగునీటి పథకం అమలుకు ఆమోద ముద్ర వేయడంతో కంటోన్మెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం కంటోన్మెం ట్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కంటోన్మెంట్లోని పికెట్, వాల్మీకీనగర్, కార్ఖానా, బొల్లారం, తిరుమలగిరి, రసూల్పురా ప్రాంతాల్లో ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిల నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. మొదటగా పికెట్లోని అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాల వేసిన నేతలు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కంటోన్మెంట్లో అన్ని వర్గాలకు మేలు జరిగేలా 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని వర్తింపజేయనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. రెండు రోజుల్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్కుమార్కు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. సంబురాల్లో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథ్, ప్రభాకర్, శ్యామ్కుమార్, నళినికిరణ్తో పాటు నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గజ్జెల నేతృత్వంలో..
బోర్డు పరిధిలోని డైమండ్ పాయింట్ చౌరస్తా, తిరుమలగిరి ప్రాంతాల్లో శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రాజు, సతీష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.