Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇద్దరు పహిల్వాన్ల మధ్య సంభవించిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రేక్షకులకు సైతం గాయాలయ్యాయి.
గత మూడు రోజులుగా ఎల్బీ స్టేడియంలో మోదీ కేసరి దంగల్(కుస్తీ) పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఇద్దరు పహిల్వాన్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే, మరో వైపు ఇద్దరు పహిల్వాన్ల మద్దతుదారులు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. దీంతో ప్రేక్షకులు భయపడి స్టేడియం బయటకు పరుగెత్తారు. ఈ ఘటనలో పలువురి ప్రేక్షకులకూ సైతం గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.
మోడీ కేసరి ఈవెంట్లో కొట్టుకున్న పహిల్వాన్లు
హైదరాబాద్ – ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న మోడీ కేసరి పహిల్వాన్ ఈవెంట్లో శుక్రవారం రాత్రి జాఫర్ పహిల్వాన్, సలాం పహిల్వాన్ మధ్య గొడవతో ఇద్దరు పహిల్వాన్ల అనుచరులు కుర్చిలతో కొట్టుకున్నారు. pic.twitter.com/c5zcoEKsl1
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2023