సిటీబ్యూరో,జూలై 6 (నమస్తేతెలంగాణ) : చల్లటి గాలులు..పగలంతా మబ్బులు..అడపాదడపా చినుకులతో నగరమంతా ఆహ్లాదకరంగా మారగా, హుస్సేన్సాగర్లో జరుగుతున్న సెయిలింగ్ పోటీలు కనువిందు చేస్తున్నాయి.
రెండోరోజు బుధవారం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వందలాదిమంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, నగరం నుంచి 25 మంది హాజరయ్యారు. ఈనెల 9వ వరకు పోటీలు జరగనున్నాయి.