సుల్తాన్బజార్, అక్టోబర్ 13: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ర్టానిదేనని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్నాయక్ అన్నారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి పలు రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటికి పూజలు నిర్వహించి ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు ‘రామ రామ ఉయ్యాలో.. రాములోరి సీత ఉయ్యాలో..’ అంటూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.బాలకృష్ణ, ఎస్ఎఫ్సీ కోఆర్డినేటర్ వెంకటరమణతోపాటు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.