GHMC |సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమ స్తే తెలంగాణ) : బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నెలలో ఐదు అదివారాలు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 3, 10, 17, 24, 31వ తేదీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఉంటుందని, వినియోగదారులు అసెస్మెంట్లలో లోపాలతో పాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.