చిక్కడపల్లి :నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి..ఉదయం పవిత్రాహ్వానము,స్వస్తివాచనము,రక్షబంధనము,హవనము, వేదప్రబంధ పారాయణము,సాయంత్రం 5 గంటలకు ఆరగింపు, మంత్రపుష్పము,తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు జరిగాయి. కార్యనిర్వాహణాధికారి కె.రామాంజనేయులు, ఆలయ వ్యవస్థాపక వంశీయుడు కి.శే.జి.రాజేంద్రనాథ్ గౌడ్ కుమారుడు శ్రీనాథ్ గౌడ్ల పర్యవేక్షణలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.