కందుకూరు, డిసెంబర్ 6: ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, కాసోజు ప్రశాంత్చారి, ఎగ్గిడి గణేశ్, రామకృష్ణ, శ్యామ్ బాబు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, సామ సురేందర్రెడ్డి, దేవీలాల్, అంజిరెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, వెంకట్రెడ్డి, రవీందర్, అబీబ్తో పాటు పలువురు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎంతో కష్టపడి గెలిపించిన వారందరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలొ్ంగన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంతో బుధవారం కర్ణాటకలోని గుల్బర్గాలో ముస్లిం నాయకులు ప్రత్యేక పూజలను నిర్వహించి తమ మొక్కులను చెల్లించారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంఏ సమీర్, తుక్కుగూడ మున్సిపాలిటీ మైనారిటీ అధ్యక్షుడు ఎండీ బషీర్, కౌన్సిలర్ తేజస్విని శ్రీకాంత్గౌడ్, మత గురువులు సయ్యద్ సాబేర్, హుస్సేన్, తాతూజీ నాయకులు ప్రబాకర్ చారి, శ్రీకాంత్గౌడ్, రాజేందర్, యాదగిరిరెడ్డి, రాజ్కుమార్, సురేశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.