బడంగ్పేట,మే18: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ ఖాన్ చెరువును విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. భవిష్యత్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు. చెరువు కట్టను విస్తరణ చేసి కట్ట ఎత్తు పెంచుతామన్నారు. అదేవిధంగాడ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.