హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో పెను ప్రమాదం తప్పింది. హైటెక్ సిటీ (Hitech city) సమీపంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. కారు నడుస్తుండగా మంటలు చెలరేగాయి. అయితే అందులో ఉన్నవారు వాటిని గుర్తించి వెంటనే దిగిపోయారు. మంటలకు కారు ధ్వసమయింది. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కారు ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.