హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు.
చెట్లు విరిగి బస్సుపై పడటంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుపోయాడు. దీంతో ఆయనను వెళికితీయడానికి చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.