హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా రెండో రోజూ దాడులు కొనసాగిస్తున్నారు. నగర శివార్లలోని హయత్నగర్ వద్ద జాతీయ రహదారులపై ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని, ఫైర్సేఫ్టీ, అక్రమంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.
గురువారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. మరికొన్నింటిపై కేసులు నమోదుచేశారు. బుధవారం పది బస్సులపై కేసులు నమోదుచేయగా, రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.