సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్లతో సెంట్రల్ జోన్కు భారీ ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీఎస్ 09 జీఈ 9999 నంబర్కు అత్యధికం గా రూ.17లక్షల 35వేల ధర పలికిందని ఖైరతాబాద్ ఆర్టీవో పాండురంగనాయక్ తెలిపారు. కీస్టోన్ ఇఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై నంబర్ను దక్కించుకున్నది. టీఎస్ 09 జీఎఫ్ 0005 నంబర్ను రూ.3లక్షల 75వేలకు లలితా జువెల్లర్స్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకున్నది.
టీఎస్ 09 జీఎఫ్ 0001 నంబ ర్ను ఎన్బీకే టాలెంట్ స్టూడియో-3 ఎల్ఎల్పీ, టీఎస్ 09 జీఎఫ్ 0099 నంబర్ను రూ.2 లక్షల 31 వేల 999కి ద్యాప వరూధినిరెడ్డి, టీఎస్ 09 జీఎఫ్ 0111 నంబర్ను రూ.2లక్షల 9వేల 999లకు 99 వెంచర్స్ సంస్థ, టీఎస్ 09 జీఈ 0027 నంబర్ను రూ.లక్షా 36వేల 500లకు నియోలాండ్ ల్యాబో రేటరీస్ లిమిటెడ్, టీఎస్ 09 జీఎఫ్ 0007 నంబర్ను రూ.లక్షా ఒక వెయ్యి 999లకు హిల్ తియరీ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. వేలం పాటలో మొత్తం రూ.45,98,490 ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.