కొండాపూర్ : చందానగర్ పోలీసులు, మాదాపూర్ జోన్ ఎస్ఓటీ బృందం కలిసి చందానగర్ బస్స్టాప్ ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో పరస బాలకృష్ణ (35) వద్ద రూ.69 లక్షలు లభించాయి. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్నాడని, సీజ్ చేసిన నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించినట్టు చందానగర్ పోలీసులు తెలిపారు.
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీసులు మంగళవారం ఆర్కేపురం చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.
మెహిదీపట్నం: ఆసిఫ్నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఆసిఫ్నగర్ క్రాస్ రోడ్లో జేబాబాగ్కు చెందిన అబ్దుల్ సలీం అనుమానాస్పదంగా వెళ్తుండగా అతడిని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. అతడి వద్ద రూ. 2 లక్షల 17 వేలు లభించాయి. అదే విధంగా.. మల్లేపల్లి ప్రియా థియేటర్ వద్ద వాహనాల తనిఖీల్లో ఆగాపురాకు చెందిన జమీర్ అలీ వద్ద రూ. రెండు లక్షలు హుమాయూన్నగర్ పోలీసులు పట్టుకున్నారు.