హైదరాబాద్: రద్దయిన కరెన్సీ నోట్లను (Old Currency) మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టివోలీ ఎక్స్ట్రీమ్ థియేటర్ సమీపంలో రద్దయిన పాత నోట్లు మార్చేందుకు యత్నిస్తున్నారని బేగంపేట పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహబూబ్నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్రెడ్డి, గొల్లమందల రవిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల నోట్లతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన మరికొందరితో కలిసి పాత నోట్లను మార్చడానికి యత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నలుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.