హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ పరిధిలో భారీ చోరీ జరిగింది. నేరేడ్మెట్లోని కేశవ్నగర్లో తాళం వేసి ఉన్న ఇంటికి దుండగులు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. గుర్తించిన ఇంటి యజమాని.. తమ ఇంట్లో రూ.30 లక్షల నగదు, బంగారు, వెండి నగలు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు.