మహిళలకు కుట్టు మిషన్లు, సైకిళ్ల పంపిణీ
షేక్పేట్, ఏప్రిల్ 30 : రోటరీస్ బాహుబలి సర్వీస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 500 కుట్టు మిషన్లు, 500 సైకిళ్లు, 500 స్కూల్ డెస్క్లు, 90 వాష్ స్టేషన్స్ను మహిళలకు షేక్పేట్లోని జి. నారాయణమ్మ విద్యా సంస్థ ప్రాంగణంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు శేఖర్ మెహతా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థతో పాటు ఇతరులు గుర్తించిన లబ్ధిదారులకు రూ. 1.5 కోట్లతో 26 రోజుల్లో నిధులు సేకరించి మహిళలకు కుట్టు మిషన్లు, సైకిళ్లు వంటివి అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేశ్ కొత్తగి, ఏఎస్ వెంకటేశ్, కమల్ సంఘ్వీ, రవి వడ్లమాని, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.