జీవితకాలం మద్దతుగా ఉంటానన్న
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ శిలలు త్వరలోనే జాతీయ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.