కుత్బుల్లాపూర్: నగర శివార్లలోని సూరారంలో (Suraram) భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సూరారంలోని కాశీవిశ్వనాథుని ఆలయంలో దుండగులు చొరబడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.