కాచిగూడ, ఫిబ్రవరి 21 : పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్ ప్రాంతానికి చెందిన పాండు భార్య పి.లక్ష్మి(33) టైలరింగ్ చేస్తుంది. సోమవారం రాత్రి బుద్వేల్ మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చే క్రమంలో బుద్వేల్ రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 3.50 తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బాధితురాలు కాచిగూడ రైల్వే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.