మెహిదీపట్నం, నవంబర్ 10: గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు.
ఇబ్రహీంబాగ్ సమీపంలో బైక్ ఆగిపోయింది. బైక్ స్టార్ట్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతడి మెడలో ఉన్న 15 గ్రాముల బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. దీంతో బాధితుడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.