గౌతంనగర్, జనవరి 2 : ప్రజా రవాణా కోసం మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణలో భాగంగా అషుర్ఖానను తొలిగించారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మౌలాలి దర్గాలో ముస్లింలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఇబ్బందులు తొలగించడానికే రోడ్డు విస్తరణ చేపడుతున్నామన్నామని తెలిపారు. కొన్నేండ్ల నుంచి మౌలాలి కమాన్ గుండా రాకపోకలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం అంబులెన్స్ రాలేక పోయిందని తెలిపారు. దీంతో రోడ్డు విస్తరణలో భాగంగా కమాన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న అషుర్ఖానను తొలగించామని, మరోచోట దాన్ని నిర్మిస్తామని .. అందుకు అయ్యే ఖర్చు కోసం రూ.5లక్షలను ఎమ్మెల్యే తరపున అందజేస్తానని తెలిపారు. అలా గే.. అషుర్ఖాన నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా కొంత మంది విరాళాలు అం దజేశారు. కార్యక్రమంలో అమీనొద్దీన్, కరార్ అలీ, రాజ, ఇబ్రహీం, షకీల్, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు రాముయాదవ్, మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి సతీశ్కుమార్, మౌలాలి డివిజన్ నాయకులు భాగ్యనందరావు, సత్తయ్య, సంతోశ్నాయుడు, ఆదినారాయణ, సంతోశ్గుప్తా, గౌలికర్ శైలేందర్, గౌలికర్ దినేశ్, గణేశ్, నవాబు పాల్గొన్నారు.