హైదరాబాద్ : అవుటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది . ఆగిఉన్న టిప్పర్ను కంటైనర్(Container ) ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు .. కొల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూరు గ్రామ సమీపంలో టిప్పర్ మరమ్మతుకు గురయ్యింది.
టిప్పర్ రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో మహారాష్ట్ర (Maharastra) కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజయ్కుమార్ వెల్లడించారు.