బాలానగర్, జూలై 21 : అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ ఎండీ వహీదుద్ధీన్ కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్న అశోక్ మణికంఠ (24), అనిల్ మణికంఠ సోదరులు. అశోక్ మంగళవారం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో హెవీ లైసెన్స్ తీసుకోవడానికి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్పై వేగంగా దూసుకువెళ్లాడు. వాహనం అదుపుతప్పి ైఫ్లై ఓవర్ రెయిలింగ్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అశోక్ కిందపడ్డాడు. ప్రయాణికులు గమనించి 108 సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మణికంఠను పరిశీలించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.