హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల నుంచి సైతం పలువురు విద్యార్థులు వస్తుండటం విశేషం. గతంలో పది, పన్నెండు దేశాల విద్యార్థులు మాత్రమే భారత్కు రాగా, ప్రస్తుతం 136 దేశాల విద్యార్థులు ఇక్కడ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల పట్ల ఆసక్తి చూపే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్లో 145 మంది విదేశీ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. నీట్ యూజీ పరీక్షలో 424 మంది అర్హత సాధించారు. వీరితోపాటు ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ సైతం గణనీయంగానే క్వాలిఫై అయ్యారు.
ఈ పథకం ద్వారా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, పలు యూనివర్సిటీల్లో ఫీజు రాయితీలు ఇస్తున్నారు. వివిధ సంస్థల్లో 25 నుంచి 100 శాతం వరకు ఫీజులను మాఫీ చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల కోసం కేరళలోని అమృత విశ్వవిద్యాపీఠంలో 3,775 సీట్లు, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా వర్సిటీలో 591 సీట్లు కేటాయించారు. పథకంలో భాగంగా 2020లో 20 వేల మంది, 2021లో 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.